న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో క్రేజీ హీరో సినిమా !

న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో క్రేజీ హీరో సినిమా !

Published on Aug 3, 2020 8:13 PM IST

ప్రస్తుతం సౌత్ ఇండియాలో క్రేజీ హీరోల్లో మళయాల నటుడు నివిన్ పాలీ ఒకరు. ప్రేమమ్ మూవీతో దేశమంతా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన సినిమాలన్నిటికీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఫ్యాన్స్ అయిపోయారంతా. ఆయన నటించిన ‘‘మూతన్” అనే సినిమా కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ‘‘న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్” లో ఈ సినిమా ఏకంగా మూడు అవార్డులు గెలుచుకోవడం విశేషం.

అక్బర్ పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ అందించిన నివిన్ పాలీ కి ఉత్తమ నటుడిగా అవార్డు రాగా, బెస్ట్ చైల్డ్ అర్టిస్టుగా సంజనా దీపు, బెస్ట్ మూవీ గా ‘‘మూతన్”, ఇలా మూడు అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది.నివిన్ ఈ అవార్డు అందుకున్న మొదటి మలయాలం నటుడు కావడం విశేషం. గతేడాది నవంబర్ లో హిందీ,మళయాలం భాషల్లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ విమర్శకుల నుండి అలాగే ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంది.గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హిందీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించాడు. నివిన్ పాలీ తో పాటు శోభిత ధూలిపాల్ల,శశాంక్ అరోరా, రోషన్ మథ్యూ, సంజనా దీపూ తదితరులు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు