‘సలార్ 2’ స్పెషల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ?

‘సలార్ 2’ స్పెషల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ?

Published on Sep 22, 2024 10:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ప్రభాస్- మిగిలిన ప్రధాన పాత్రల పై భారీ యాక్షన్ సీన్స్ ను ఘాట్ చేస్తారట. ఈ సీన్స్ లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయట. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

అన్నట్టు ఈ సీక్వెల్‌లో నటిస్తున్న శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు శ్రియా రెడ్డి కూడా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ తో తిరిగి సెట్స్ పైకి రానున్నారు. కాగా, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పార్ట్-2ని త్వరగా పూర్తి చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. మొత్తానికి సలార్ 2తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు