క్రేజీ న్యూస్ : బాలీవుడ్ లో రీమేక్ కానున్న సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’ ?

క్రేజీ న్యూస్ : బాలీవుడ్ లో రీమేక్ కానున్న సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’ ?

Published on Oct 12, 2023 2:03 AM IST

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఎఫ్ 2. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీ 2019లో ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇటీవల దీనికి సీక్వెల్ గా రూపొందిన ఎఫ్ 3 సైతం సూపర్ హిట్ అందుకోవడం విశేషం. అయితే విషయం ఏమిటంటే, అతి త్వరలో ఎఫ్ 2 మూవీని బాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖ హీరోలతో నిర్మాత దిల్ రాజు రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. అలానే ఈ మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి అక్కడ కూడా తెరకెక్కించనున్నారట. కాగా ఈ క్రేజీ న్యూస్ పై మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది. మరి ఈ ప్రాజక్ట్ లో హీరోలు, హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు