రణబీర్, సాయి పల్లవి “రామాయణం” పై క్రేజీ అప్డేట్

రణబీర్, సాయి పల్లవి “రామాయణం” పై క్రేజీ అప్డేట్

Published on Sep 8, 2024 6:42 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “అనిమల్” తర్వాత తాను చేస్తున్న మరో అవైటెడ్ సినిమా “రామాయణ” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి సీతగా దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం కొన్ని నెలల కితం షూటింగ్ ని స్టార్ట్ చేసుకుంది.

అయితే ఈ సినిమాపై ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇప్పుడు పూర్తి చేసేసారట. అవును ఇది నిజమే అని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే మేజర్ గా అవుట్ డోర్ లో షూటింగ్ చేయలేదు కానీ ఈ చిత్రాన్ని దాదాపు స్టూడియో లోనే పూర్తి చేసేసారట.

సో ఇలా నటీనటుల పార్ట్ వరకు షూటింగ్ మొత్తం ఈ చిత్రానికి కంప్లీట్ అయ్యిపోయిందట. ఇక సినిమా వి ఎఫ్ ఎక్స్ పనులే బాకీ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్ రావణ్ పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇతర విషయాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు