“పుష్ప” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్, టైం ఫిక్స్.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో “పుష్ప ది రైజ్” పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది. మరి థియేట్రికల్ గా మరియు ఓటిటి లో కూడా వచ్చి అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు టెలివిజన్ తెరపై కూడా టెలికాస్ట్ ని సిద్ధం అయ్యిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ మరియు టైం ని ఈ చిత్రం ఫిక్స్ చేసుకుంది. ఈ మార్చ్ 13 సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో ఈ చిత్రం మొట్టమొదటి సారిగా టెలికాస్ట్ కావడానికి రెడీగా ఉంది. మరి ఈ ఫస్ట్ టైం ప్రీమియర్ తో పుష్ప రాజ్ ఎలాంటి టీఆర్పీ అందుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version