మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘సర్కారు.. ‘ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ !

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘సర్కారు.. ‘ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ !

Published on Sep 19, 2022 10:00 AM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సర్కారు వారి పాట. ఈ సినిమా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతో అలరించింది. పైగా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. ఐతే, తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. ప్రముఖ ఛానల్ స్టార్ మా టెలివిజన్ ప్రీమియర్ లో వచ్చే ఆదివారం అంటే.. సెప్టెంబర్ 25, 2022న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ చిత్రం, మహేష్ అభిమానుల అంచనాలను అందుకోగలిగింది. పైగా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ యాక్షన్ డ్రామాగా సాగుతూ సర్కారు వారి పాట మెప్పించింది. అన్నిటికీ మించీ మహేష్ మరోసారి తన నటనతో అబ్బురపరిచాడు. మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు