40వేలకు పైగా అమ్మకాలతో ‘దేవర’ తుఫాను

40వేలకు పైగా అమ్మకాలతో ‘దేవర’ తుఫాను

Published on Sep 15, 2024 3:00 AM IST

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దేవర’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే, ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాపై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా రిలీజ్‌కి ముందే అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్‌కి ఇంకా 13 రోజులు మిగిలి ఉండగానే, ఈ సినిమా ప్రీసేల్స్ టికెట్లు ఏకంగా 40వేలకు పైగా అమ్ముడయ్యాయి.

ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసిన దేవర, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. సెప్టెంబర్ 27న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు