ఆ టాలీవుడ్ హీరోతో మల్టీస్టారర్ చేస్తా – ధనుష్!

ఆ టాలీవుడ్ హీరోతో మల్టీస్టారర్ చేస్తా – ధనుష్!

Published on Jul 21, 2024 11:27 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ రాయన్. జూలై 26, 2024 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన భాషల్లో థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిపోయిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఒకవేళ మల్టీ స్టారర్ చేయాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లలో ఎవరితో చేస్తారు అని యాంకర్ అడగగా, అందుకు జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు ధనుష్.

ఈ ఆన్సర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో 50 వ చిత్రంగా తెరకెక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు