ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “కుబేర”

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “కుబేర”

Published on Feb 28, 2025 7:59 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న అవైటెడ్ బై లింగువల్ చిత్రం “కుబేర” కోసం అందరికీ తెలిసిందే. ధనుష్ క్రేజీ మేకోవర్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది కానీ రిలీజ్ మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.

అయితే దీనిపై మేకర్స్ ఎట్టకేలకి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ జూన్ 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇపుడు ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటి పార్ట్నర్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. సో థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ ఓటిటిలో సినిమా రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆసియన్ సునీల్ అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు