వాయిదా పడ్డ ‘ధూం ధాం’ చిత్రం

వాయిదా పడ్డ ‘ధూం ధాం’ చిత్రం

Published on Sep 9, 2024 11:07 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ధూం ధాం’ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మచ్చ సాయికిషోర్ డైరెక్ట్ చేయగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరద పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు.

ఫ్రైడే ఫ్రేమ్‌వర్క్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్‌పై ఎంఎస్.రామ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ వర్మ, బెనర్జీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు