‘కరెన్సీ నగర్’ ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల

‘కరెన్సీ నగర్’ ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల

Published on Dec 18, 2023 2:00 PM IST


ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాలకృష్ణ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కరెన్సీ నగర్. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదలకు రెడీ అవుతోంది.

కరెన్సీ నగర్ సినిమాలో మనిషికి, మనీకి, నైతికతకు ఉండే బంథాన్ని, నాలుగు కథల రూపంలో చక్కగా తెరకెక్కించారు దర్శకుడు వెన్నెల కుమార్. పాటలు, సంగీతం అందర్నీ ఆకట్టుకుంటాయని ఈ మూవీ యూనిట్ చెప్తోంది. ఉత్కంఠభరితమైన కధనం, ఊహించని ముగింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని వారు చెప్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. తాజాగా కరెన్సీ నగర్ ట్రైలర్ ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో మొదటిసారిగా వస్తోన్న అంధాలజీ సినిమా ఇది. ట్రైలర్ బాగుంది, అందరూ బాగా చేశారు, ఈ సినిమాతో దర్శకుడు వెన్నెల కుమార్ విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంటాడాని కోరుకుంటూ చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు