నితిన్ ను డైరెక్ట్ చేయనున్న వేణు!?

ప్రముఖ కమెడియన్ వేణు యెల్దండి మొదటి బలగం చిత్రంతో దర్శకుడుగా తన సత్తా చాటాడు. ఈ చిత్రం ఎన్నో అవార్డులను గెలుచుకోవడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని తో చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే పలు కారణాల వలన నాని ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు.

అయితే ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు హీరో నితిన్ చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇంకా ఈ చిత్రం చర్చల దశలోనే ఉండటంతో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. త్వరలో ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. హీరో నితిన్ ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్‌హుడ్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటుగా తమ్ముడు అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version