లైంగిక వేధింపుల పై మీడియా ఎదుట మాట్లాడవద్దు – నటి రోహిణి

లైంగిక వేధింపుల పై మీడియా ఎదుట మాట్లాడవద్దు – నటి రోహిణి

Published on Sep 8, 2024 5:28 PM IST

జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి ధైర్యంగా బయట పెడుతున్నారు. ఈ క్రమంలో నటీమణులు మీడియా ఎదుట తమ సమస్యలను తెలియజేస్తున్నారు. దీంతో, నటి రోహిణి మాట్లాడుతూ.. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ నివేదికను సిద్ధం చేయడం జరిగింది.

మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసింది కమిటీ. కాబట్టి, లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని ఆమె చెప్పుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఆమె చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు