ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు, నటుడు శ్రీ సింహ కోడూరి మత్తు వదలారా చిత్రంలో తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన రాబోయే చిత్రం కారణంగా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. సెప్టెంబర్ 2021 లో అతని కొత్త చిత్రం దొంగలున్నారు జాగ్రత్త పూజతో ప్రారంభించబడింది.
అయితే రేపు ఉదయం 10:08 గంటలకు ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మళ్లీరావా ఫేమ్ ప్రీతి అస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ గురు ఫిల్మ్స్ తో చేతులు కలిపి ఈ చిత్రాన్ని నిర్మించింది.


