‘డబుల్ ఇస్మార్ట్’ : భారీ బడ్జెట్ తో ఆ ఎపిసోడ్ చిత్రీకరణ ?

‘డబుల్ ఇస్మార్ట్’ : భారీ బడ్జెట్ తో ఆ ఎపిసోడ్ చిత్రీకరణ ?

Published on Jan 25, 2024 1:18 AM IST

ఉస్తాద్ రామ్ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ పై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి విషయం ఏమిటంటే, తాజాగా డబుల్ ఇస్మార్ట్ మూవీకి సంబంధించి క్లైమాక్స్ ఎపిసోడ్ ని దాదాపుగా రూ. 7 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో 12 రోజుల పాటు చిత్రీకరించిందట టీమ్. కాగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది హైలైట్స్ గా నిలుస్తాయట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మార్చి 8 న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు