టాలీవుడ్ లొ తక్కువ టైం లో నటుడిగా చాలా మంచి పేరు సంపాయించిన కార్తిక్ రత్నం హీరోగా, స్టన్నింగ్ బ్యాూటి సుప్యర్ద సింగ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం లింగోచ్చా. ఆనంద్ బడా ని దర్శకుడి గా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా అక్టొబర్ 27న విడుదల కానుంది. జె నీలిమ సమర్పకులు గా వ్యవహరిస్తుండగా, మల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా ఉన్నారు.
సోహెల్ మాట్లాడుతూ, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ ఫంక్షన్ కి నేను రావడానికి ముఖ్య కారణం కరీముల్లా, ఆయన పాడిన పాటలు జై బాలయ్య సాంగ్ అలాగే ఆయనతో నాకున్న కనెక్షన్ మంచి క్లోజ్ ఉండడం వల్ల అండ్ నాకిష్టమైన వ్యక్తులు కార్తీక్రత్నం అండ్ సుహాస్ వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తులు అని చెబుతూ, వాళ్ల గురించి కూడా నేను మాట్లాడతాను కచ్చితంగా, సో వాళ్ళ ఫంక్షన్ లు ఏమున్నా, ఈవెంట్ల ఏమున్నా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతాను అంటూ సోహెల్ గారు మాట్లాడడం జరిగింది.
ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, లింగొచ్చా సినిమా అక్టోబర్ 27న రిలీజ్ అవుతుంది. అలాగే మంచి సక్సెస్ అవ్వాలని, అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమా చాలా మంచిగా వచ్చిందని, ప్రొడ్యూసర్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమాని చాలా గ్రాండ్గా తెరకెక్కించాం అని అన్నారు. అలాగే కార్తీక్ రత్నాన్ని చాలా కొత్తగా చూడొచ్చు ఈ సినిమాలో. చాలా మంచి యాక్టింగ్ చేశాడు. కార్తీక్ రత్నానికి మంచి ఫ్యూచర్ ఉంది అని అన్నారు.
హీరో కార్తీక్ రత్నం మాట్లాడుతూ, ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆనంద్ కొత్తవాడైనా కూడా, కొత్తదనం తనలో కనబడకుండా ఎంతో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా ఈ సినిమాను తీసుకుని వచ్చాడు. అలాగే ప్రొడ్యూసర్లు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా దర్శకుడుకి, టీంకి మంచి సపోర్ట్ ఇచ్చి, ఈ సినిమాని కరెక్ట్ గా అనుకున్న విధంగా తీసేలాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని, కచ్చితంగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ ఫిదా కూడా మంచి ఆదరణ పొందుతోంది అని అన్నారు.