ఫస్ట్ సింగిల్ తో రానున్న ‘డిస్కోరాజా’ !

ఫస్ట్ సింగిల్ తో రానున్న ‘డిస్కోరాజా’ !

Published on Oct 17, 2019 8:18 PM IST

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’. కాగా ఈ సినిమా నుండి ‘నువ్వు నాతో ఏమన్నావో’ అనే మొదటి పాట రాబోతుంది. ఈ పాటను అక్టోబర్ 19న సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. మొత్తానికి అక్టోబర్ 19న ‘డిస్కోరాజా’ పాటతో కుమ్మేస్తాడు అన్నమాట.

ఇక ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండటంతో ప్రచార కార్యక్రమాల్ని షురూ చేసింది టీమ్. ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ , తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయని చిత్రబృందం చెబుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు