ఇంటర్వ్యూ: ‘మత్తు వదలరా 2’లో ఫన్, థ్రిల్ డబుల్ ఉంటుంది – హీరో శ్రీ సింహ

ఇంటర్వ్యూ: ‘మత్తు వదలరా 2’లో ఫన్, థ్రిల్ డబుల్ ఉంటుంది – హీరో శ్రీ సింహ

Published on Sep 9, 2024 8:19 PM IST

బ్లాక్‌బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్‌గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీ సింహ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘మత్తు వదలరా 2’కు ఎలా ప్రీపరేషన్ జరిగింది?
చాలా బాగా జరిగింది. గెటప్, క్యారెక్టర్స్ స్టయిలింగ్ మారింది. ‘హీ’ టీం ఏజెంట్స్‌గా చూపించాం. ఫస్ట్ పార్ట్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.

‘మత్తు వదలరా 2’ ఆలోచన మొదటి నుంచా ఉందా?
రిలీజైయ్యాక హిట్ అయిన తర్వాత సీక్వెల్ చేద్దామని నాకు, చెర్రీ గారికి ఉండేది. డైరెక్టర్ రితిష్ లాస్ట్ ఇయర్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతాయి. డెలివరీ బాయ్స్ నుంచి ఏజెంట్స్ ఎలా అయ్యారనే లింక్ చూపిస్తాం.

పార్ట్ వన్ పెద్ద హిట్ట్ అయ్యింది కదా.. రెండో పార్ట్ అంచనాలు విషయంలో ఒత్తిడి తీసుకున్నారా?
సినిమా హిట్ అయ్యిందని పార్ట్ 2 తీస్తే ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ డైరెక్టర్ రితిష్‌కి ఈ కథ ఫస్ట్ పార్ట్‌కి మ్యాచ్ అయ్యేలా ఆర్గానిక్‌గా వచ్చింది. అందుకే నేచురల్‌గా అంతా సెట్ అయ్యింది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్‌దే.

రిలీజ్ టైంకే సినిమా బయటికి వచ్చింది. అంతకుముందు అంత సైలెంట్‌గా ఉండటానికి కారణం?
ఇదొక కొత్త స్ట్రాటెజీలా అనుకున్నాం. అనౌన్స్ చేస్తే బజ్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ హిట్ కాబట్టి ఆడియన్స్ ఎక్సయిట్ అవుతారు. అయితే సినిమా పూర్తయి విడుదలకి వచ్చేసరికి దానిపై బజ్ తగ్గొచ్చు. ఎక్సయిట్మెంట్ పలచబడకముందే వేడివేడిగా వడ్డించేయాలనే ఉద్దేశంలో ఇలా చేశాం. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే మా స్ట్రాటెజీ వర్క్ అయ్యిందనిపించింది.

ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు కదా.. ఆయన రియాక్షన్ ఏమిటి?
చాలా ఎంజాయ్ చేశారు. టీజర్, ట్రైలర్ సాంగ్ చూసి చాలా ఎక్సయిట్ అయ్యారు. ఆయనికి జెన్యూన్‌గా నచ్చితేనే అంత టైం స్పెండ్ చేస్తారు.

ఫరియాతో వర్క్ చేయడం గురించి?
ఫరియా ఫన్నీ క్యారెక్టర్స్‌కి బాగా సెట్ అవుతుంది. నేచురల్‌గా తనలో ఫన్ ఉంటుంది. ఇందులో తన పాత్ర యాక్షన్ కూడా ఉంది. ఈ క్యారెక్టర్‌కి ఫరియా యాప్ట్. ఈ సినిమాలో తను సాంగ్ రాయడంతో పాటు కొరియోగ్రాఫ్ చేసింది. అది ప్రమోషన్స్‌కి బాగా యూజ్ అయ్యింది.

ఇది మర్డర్ మిస్టరీనా.. డ్రగ్స్ బ్యాక్ డ్రాపా?
ఫస్ట్ పార్ట్‌లో మర్డర్ ఎవరు చేశారు అనే ట్రాక్‌తో పాటు డ్రగ్స్ ట్రాక్ ఉంటుంది కదా.. ఇందులో కూడా ఆ రెండింటితో పాటు ఇంకొన్ని లేయర్స్ యాడ్ అవుతాయి.

మ్యూజిక్‌లో ఎక్సపర్మెంట్ చేస్తున్నారా?
ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయ్యిందో దాని బీజీఎంకి కూడా అంత మంచి పేరు వచ్చింది. సెకండ్ పార్ట్‌కి కూడా అలానే వస్తుందనే నమ్మకం ఉంది.

‘మత్తు వదలరా’ రీరిలీజ్ షో తర్వాత ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది?
ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం కలిసి చూశాం. కొంత మంది ఫస్ట్ పార్ట్‌ని థియేటర్స్‌లో మిస్ అయ్యారు. అలా మిస్ అయినవారంతా వచ్చి చూడటం చాలా హ్యాపీగా అనిపించింది.

రాజమౌళి గారి రియాక్షన్ ఏమిటి?
రాజమౌళి గారికి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. చాలా ఎంజాయ్ చేశారు. ప్రోడక్ట్ విషయంలో హ్యాపీగా ఉన్నారు.

ప్రిమియర్స్ ఎప్పుడు?
ప్లాన్ చేస్తున్నాం. 12న ఒక ప్రిమియర్ ఉండొచ్చు. ఇంకా ప్లాన్ చేస్తున్నాం.

ఈ సినిమాలో మీమ్స్ రిఫరెన్స్ ఎంతవరకు ఉంటుంది?
ఫస్ట్ పార్ట్‌లో ఎంతవరకు ఉన్నాయో అంత వరకు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఉంటాయి. సోషల్ మీడియాతో పరిచయం లేని ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే కథ, క్యారెక్టర్స్ ఉంటాయి. ఫన్, థ్రిల్ డబుల్ ఉంటుంది.

సత్య, మీ కాంబినేషన్ సూపర్ కదా.. సెకండ్ పార్ట్‌లో ఎలా ఉంటుంది?
మా ఇద్దరి కెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్‌లో నేచురల్‌గా వచ్చింది. సూపర్‌గా వర్క్ అయ్యింది. సెకండ్ పార్ట్‌లో మేమిద్దరం త్రూ అవుట్ కనిపిస్తాం. వెన్నెల కిశోర్ ఇందులో ఫస్ట్ పార్ట్‌తో సంబంధం లేని క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

డైరెక్టర్ రితిష్ రానా గురించి?
రితిష్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సినిమా విజన్ బోర్డ్ తన మైండ్‌లో ఉంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల గురించి?
ఇలాంటి అద్భుతమైన టీంని ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను. ఫస్ట్ పార్ట్‌కి మంచి పేరు వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్‌కి స్కేల్ పెంచారు. బాగా ఖర్చుపెట్టారు. సినిమాని గ్రాండ్‌గా తీశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు