కన్ఫ్యూజన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ?

కన్ఫ్యూజన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ?

Published on Oct 4, 2023 3:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ పై చరణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే గేమ్ ఛేంజర్ 2024 లో వచ్చే ఛాన్స్ లేదని తాజాగా న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం ప్రస్తుతం మరోవైపు కమల్ తో చేస్తున్న భారతీయుడు 2 తో పాటు దానికి సీక్వెల్ గా భారతీయుడు 3 ని కూడా శంకర్ తెరకెక్కించనున్నారని వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది కూడా రాదని టాక్.

మొత్తంగా అసలు తమ హీరో యొక్క సినిమా విషయంలో ఏమి జరుగుతుందో తెలియడం లేదని, అలానే గేమ్ ఛేంజర్ రిలీజ్ పై మేకర్స్ ఇకనైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని, అప్పటివరకు మాకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని పలువురు రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిరాశతో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీని పై గేమ్ ఛేంజర్ మేకర్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు