ఓటీటీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసుకున్న “గుడ్ లఖ్ సఖి”

ఓటీటీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసుకున్న “గుడ్ లఖ్ సఖి”

Published on Feb 9, 2022 11:42 PM IST

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘గుడ్‌ లక్‌ సఖి’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పాదిరి నిర్మించారు. జనవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 12 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోశించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మరీ ఓటీటీలోనైనా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు