టీవీ ప్రీమియర్‌కి సిద్ధమైన గోపీచంద్ మూవీ

టీవీ ప్రీమియర్‌కి సిద్ధమైన గోపీచంద్ మూవీ

Published on Sep 13, 2024 6:04 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ‘విశ్వం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాల ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో గోపీచంద్ నటించిన లాస్ట్ మూవీ టీవీ ప్రీమియర్‌కి రెడీ అయ్యింది.

గోపీచంద్ డ్యుయెల్ రోల్‌లో నటించిన మూవీ ‘భీమా’ మార్చి 8న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హర్ష డైరెక్ట్ చేయగా, ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది.

భీమా చిత్రానికి సంబంధించి హిందీ వెర్షన్‌ను జీ సినిమాపై తొలిసారిగా టెలికాస్ట్ చేయనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ సినిమా హిందీ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. దీంతో గోపీచంద్ అభిమానులు ఈ సినిమా కోసం మరోసారి ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు