2 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘విశ్వం’ ట్రైలర్

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తనదైన మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను రీసెంట్‌గా వదిలారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ అంశాలతో ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ ట్రైలర్‌తో వింటేజ్ శ్రీను వైట్ల తిరిగి రానున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇంత ఆసక్తికరంగా ట్రైలర్ ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

కాగా, ఈ ట్రైలర్ ఇప్పుడు 2 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ ట్రైలర్ టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

Exit mobile version