ఫిల్మ్ ట్రివియా : దర్శకేంద్రుడు మల్టీస్టారింగ్ చెయ్యాలనుకున్న హీరోలు ఎవరో తెలుసా?

ఫిల్మ్ ట్రివియా : దర్శకేంద్రుడు మల్టీస్టారింగ్ చెయ్యాలనుకున్న హీరోలు ఎవరో తెలుసా?

Published on Aug 28, 2020 2:54 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏంటంటే ఎన్నో అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి దర్శకేంద్రునిగా మారిన గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రం తీయాలని అనుకున్నారు. అందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ చిత్రం పట్టాలెక్కలేదు. మరి ఇంతకీ దర్శకేంద్రుడు ఏ స్టార్ హీరోలతో ఈ భారీ మల్టీ స్టారర్ ను తీయాలనుకున్నారో వారి పేర్లు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలపండి.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఎన్నో వండర్స్ తీసిన దర్శకేంద్రుడు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లతో కలిపి ఒక బీబీహారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసారు. అది కూడా తన నూరవ చిత్రంగా తీయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాకపోవడం మూలాన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హీరోగా పరిచయం చేస్తూ “గంగోత్రి” చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు