ఫిల్మ్ ట్రివియా : తెలుగులో తమ రెండో సినిమాతో స్టార్టైన హీరోయిన్స్ ఎవరు?

ఫిల్మ్ ట్రివియా : తెలుగులో తమ రెండో సినిమాతో స్టార్టైన హీరోయిన్స్ ఎవరు?

Published on Aug 27, 2020 1:49 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ ఇద్దరు హీరోయిన్స్ బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లు. అయితే వారు పరిచయం అయ్యింది బాలీవుడ్ లో అయ్యినప్పటికీ వారి రెండో సినిమా మాత్రం మన తెలుగులోనే చేసారు. ఇపుడు ఇదే మీకు ప్రశ్న, అలా చేసిన ఆ హీరోయిన్స్ ఎవరు? మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ ఇద్దరు హీరోయిన్స్ మరెవరో కాదు ఒకరు కత్రినా కైఫ్ మరొకరు బిపాసా బసు. వీరిద్దరూ మొదట హిందీలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కత్రినా హిందీలో బూమ్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వగా మన తెలుగులో తన రెండో చిత్రం విక్టరీ వెంకటేష్ తో “మల్లీశ్వరి” చిత్రం చేసింది. అలాగే బిపాసా కూడా హిందీలో అజ్నాబీ తో ఎంట్రీ ఇచ్చి మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో “టక్కరి దొంగ” తో రెండో సినిమా తెలుగులో చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు