‘గుంటూరు కారం’ : యుఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది అప్పటినుండే ?

‘గుంటూరు కారం’ : యుఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది అప్పటినుండే ?

Published on Dec 21, 2023 1:09 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. రేపు ఈ మూవీలోని ఒక సాంగ్ ని చిత్రీకరించనున్నారు మేకర్స్. చాలా ఏళ్ళ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి యుకె లోని పలు ఏరియాల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క యుఎస్ఏ బుకింగ్స్ ని వచ్చేవారం మంగళ, బుధవారాల్లో ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న గుంటూరు కారం మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు