‘గుంటూరు కారం’ : వారిద్దరికీ పెద్ద పరీక్షేనా ?

‘గుంటూరు కారం’ : వారిద్దరికీ పెద్ద పరీక్షేనా ?

Published on Oct 8, 2023 3:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు మంచి మాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

దాదాపుగా పుష్కర కాలం తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో పాటు చాలా గ్యాప్ తరువాత మహేష్ బాబు మంచి మాస్ ఎంటర్టైనింగ్ రోల్ చేస్తుండడంతో గుంటూరు కారం పై ఈ స్థాయి హైప్ ఏర్పడింది. మరోవైపు మూవీ గురించి ఇటీవల నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, అటు దర్శకుడు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు, థమన్ ఇలా అందరూ కూడా మూవీని సక్సెస్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు.

నిజానికి గతంలో మహేష్, త్రివిక్రమ్ కలిసి వర్క్ చేసిన రెండవ మూవీ ఖలేజా కల్ట్ క్లాసిక్ గా నిలిచినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ అనేది తెలిసిందే. మరోవైపు ఇటీవల మహేష్ నటించిన సర్కారు వారి పాట మూవీకి థమన్ పూర్తిగా న్యాయం చేయలేదు అనే భావన కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కొంత ఉంది.

దానితో మొత్తంగా త్రివిక్రమ్, థమన్ ఇద్దరికీ కూడా గుంటూరు కారం మూవీ పెద్ద పరీక్షే అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే సినిమా అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు అద్భుతంగా వస్తోందని, తప్పకుండా రానున్న 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం తో అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా పండుగ చేసుకోవడం ఖాయం అని మూవీ ఇన్నర్ వర్గాల టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు