రామ మందిరానికి “హను మాన్” టీం విరాళ మొత్తం ఎంతంటే

రామ మందిరానికి “హను మాన్” టీం విరాళ మొత్తం ఎంతంటే

Published on Jan 21, 2024 11:00 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వచ్చిన ఓ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా అదరగొడుతుంది. మరి ఆ చిత్రమే “హను మాన్” కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాని మేకర్స్ మన ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించగా మేకర్స్ సినిమా ప్రీ రిలీజ్ సమయంలోనే ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చేత చేయించారు.

అయోధ్యలో ఆరంభం కానున్న రామ మందిరానికి గాను ఆ ఆరంభం లోపున హను మాన్ చిత్రం ఎన్ని టికెట్లు అయితే అమ్ముడు పోతుందో అప్పటివరకు ఒకో టికెట్ మీద 5 రూపాయలు చొప్పున విరాళం అందిస్తామని అనౌన్స్ చేశారు. మరి ఇలా అనౌన్స్ చేసిన తర్వాత సినిమా ఇలా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ టాక్ రావడంతోనే నిర్మాత మొదటి రోజే కొంతమొత్తాన్ని చెక్ రూపంలో అందించారు.

ఇక లేటెస్ట్ గా అయితే హను మాన్ యూనిట్ ఓ కీలక అప్డేట్ అందించారు. ఈరోజు వరకు హను మాన్ చిత్రం మొత్తం 53 లక్షల 28 వేల 211 టికెట్లు అమ్ముడుపోగా ఈ అన్ని టికెట్స్ కి కలిపి 2 కోట్ల 66 లక్షల 41 వేల 55 రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టుగా తెలియజేసారు. ఇలా మొత్తానికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రామయ్య కోసం హను మాన్ చిత్ర బృందం ఇంత మొత్తాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు