చిరంజీవి గారికి పాదాభివందనాలు – తేజ సజ్జా

చిరంజీవి గారికి పాదాభివందనాలు – తేజ సజ్జా

Published on Jan 8, 2024 12:04 AM IST

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాను రూపొందించాడు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ వేదికపై తేజ సజ్జా మాట్లాడుతూ .. “నా వెనుక అంజనీపుత్రుడు ఉన్నారు .. నా ఎదురుగా కూడా అంజనీ పుత్రుడు ఉన్నారు. అందువలన మాట్లాడటానికి నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే ఆపద్బాంధవుడు కాదు .. సినిమా వాళ్లకి కూడా ఆపద్బాంధవుడే.

ఎవరైనా గెలిస్తే ముందుగా ఫోన్ చేసే ప్రశంసించేది ఆయనే. ఎవరైనా ఓడిపోతే వెన్నుతట్టేది ఆయనే. నా జీవితంలో మా అమ్మానాన్నల తర్వాత నేను రుణపడి ఉండేది చిరంజీవిగారికే. ఆయనను ఆదర్శంగా తీసుకునే ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. నా ఉనికికి .. ఉన్నతకి కారణమైన చిరంజీవిగారికి పాదాభివందనాలు’ అని తేజ సజ్జా మాట్లాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు