పవన్ కి కార్తీ క్షమాపణలు.. కానీ కార్తీకే మద్దతెక్కువ.!

గత కొన్ని రోజులు నుంచి దేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాద్ విషయంలో ఎలాంటి వార్తలు వస్తున్నాయో తెలిసిందే. అయితే ఈ లడ్డు ప్రసాద విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు.

అయితే ఈ సీరియస్ వాతావరణంలో కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు కార్తీ నటించిన చిత్రం “సత్యం సుందరం” తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ తో జరిగిన మాటలలో కార్తీ ఇప్పుడు లడ్డు కోసం మాట్లాడొద్దు అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అంటూ ఫన్ గా మాట్లాడడం జరిగింది.

దీనిపై పవన్ సీరియస్ కామెంట్స్ చేశారు. నటుడుగా గౌరవం ఇస్తాను కానీ లడ్డు ప్రసాదం విషయంలో జోకులు వేసుకునేలా మాట్లాడ్డం సహించను అని తెలిపారు. దీనితో కార్తీ ఈ ఇష్యూ పై పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పడం వైరల్ గా మారింది. డియర్ పవన్ కళ్యాణ్ గారు మీ మీద అపారమైన గౌరవం ఉంది.

నా వల్ల ఏదైనా అపార్ధం జరిగితే అందుకు క్షమించండి శ్రీ వేంకటేశ్వరునికి భక్తునిగా మన సంప్రదాయాలని గౌరవిస్తాను అని కార్తీ తెలిపాడు. దీనితో పవన్ విషయంలో కార్తీ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే తన పోస్ట్ తో అత్యధికం మంది కార్తీకే మద్దతుగా నిలిచారు.

కార్తీ అన్న దానిలో తప్పేమి లేదని యాంకర్ ప్రశ్నకి కార్తీ ఆ మ్యాటర్ వద్దనే చెప్పాడని. అయినప్పటికీ కార్తీ క్షమాపణలు చెప్పడటంతో తను ఇంకో మెట్టు ఎక్కేసాడని నెటిజన్స్ అంటున్నారు.

Exit mobile version