కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ఇండియా సైతం ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ ప్రాణాంతక వైరస్ ని అదుపు చేసే పనిలో భాగంగా ఇప్పటికే అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక నేడు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని ఆదేశించగా, ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చంధంగా పాటిస్తున్నాయి.
కాగా హీరోయిన్ ప్రణీత శుభాష్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోపై స్పందించారు. కర్ఫ్యూ సమయంలో అక్కడక్కడా రోడ్లపైన తిరుగుతున్న ప్రజల పట్ల పోలీస్ లు కఠినంగా వ్యవహరించడాన్ని ఆమె తప్పు బట్టారు. రూల్స్ పాటించని వాళ్ళ పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం అవసరమా అన్నారు.
https://twitter.com/pranitasubhash/status/1241636366158458881