‘తండేల్’ జాతర పాట.. వెయ్యి మందితో షూట్..?

‘తండేల్’ జాతర పాట.. వెయ్యి మందితో షూట్..?

Published on Aug 27, 2024 1:10 AM IST


అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’ చిత్రం ఇప్పటికే పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేసింది. దర్శకుడు చందు ముండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ జాతర పాట ఈ మూవీకి హైలైట్‌గా నిలవనుందట. ఇక ఈ జాతర సాంగ్ కోసం శ్రీకాకుళం నుంచి 65 మంది కళాకారులను తీసుకువస్తున్నారట మేకర్స్. అంతేగాక, 900 మందికి పైగా డ్యాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొంటారని తెలుస్తోంది. దాదాపు వెయ్యి మందితో షూట్ చేయబోతున్న ఈ సాంగ్ కోసం భారీ సెట్స్‌ను వేస్తున్నారని.. దీని కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి జాతర సాంగ్ కోసం ఇంత భారీ వ్యయంతో షూటింగ్ చేయనుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు