‘క‌ల్కి’లో రెమ్యున‌రేష‌న్ల‌కే అంత ఖ‌ర్చు పెట్టారా..?

‘క‌ల్కి’లో రెమ్యున‌రేష‌న్ల‌కే అంత ఖ‌ర్చు పెట్టారా..?

Published on Jun 21, 2024 9:42 PM IST

ప్ర‌స్తుతం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘క‌ల్కి 2898 AD’ జూన్ 27న రిలీజ్ కు రెడీ అయ్యింది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ గ్రాండ్ విజువ‌ల్ వండ‌ర్ మూవీని చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ షేక్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మాత సి.అశ్విని ద‌త్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు దాదాపు రూ.700 కోట్లు ఖర్చ‌యిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండ‌టంతో, వారి రెమ్యున‌రేష‌న్ల‌కే దాదాపు రూ.250 కోట్లు ఖ‌ర్చ‌యిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌భాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల రెమ్యున‌రేషన్ తీసుకున్నార‌ట‌. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె లు ఒక్కొక్క‌రు రూ.20 కోట్ల మేర రెమ్యున‌రేష‌న్ అందుకున్నార‌ట‌. దిశా ప‌టాని ఈ సినిమాలో న‌టించినందుకు రూ.5 కోట్లు తీసుకుంద‌ట‌. మిగ‌తా ఆర్టిస్టుల‌కు కూడా భారీగా రెమ్యున‌రేష‌న్ అందిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి వ‌సూళ్ల‌తో దుమ్ములేపుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు