శర్వా 38 కోసం భారీ సెట్.. భూమి పూజతో వర్క్ స్టార్ట్!

యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లోని 38వ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్, తాజాగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో రానుంది. 1960లలో జరిగే కథగా ఈ సినిమాను రూపొందించానున్నారు.

దీని కోసం 1960ల పరిస్థితులకు అనుకూలంగా ఓ భారీ సెట్‌ను నిర్మించనున్నారు. ఈ సెట్‌ను హైదరాబాద్ సమీపంలోని 15 ఎకరాల స్థలంలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సెట్ నిర్మాణ పనులను భూమి పూజతో ప్రారంభించారు. ఈ సెట్ నిర్మాణ పనులు మన్నె కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్‌తో మరింత గ్రాండియర్‌గా కనిపించబోతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందించనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Exit mobile version