‘మేజర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘మేజర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on May 24, 2020 8:46 PM IST


హీరో అడివి శేషు భిన్నమైన చిత్రాలు తీస్తూ వరుస హిట్లు అందుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ‘మేజర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నారు అడివి శేషు. ఈ చిత్రంలో శోభితా ధూళిపాల కూడా ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తోన్నారు. అయితే ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుందని.. సెకెండ్ హాఫ్ లో ఆమె పాత్ర ఎంటర్ అవుతుందని తెలుస్తోంది. గూఢ‌చారి త‌ర్వాత శేష్‌ తో శోభితా ధూళిపాల క‌లిసి న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. ఆ రకంగా హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది.

కాగా 2008 ముంబై టెర్రర్ అటాక్ లో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను ప్రాణాల‌ను కాపాడారు. ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చ‌ర్స్‌, ఎప్ల‌స్ఎస్ మూవీస్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు