లేటెస్ట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా “తండేల్” కూడా ఒకటి. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో లేటెస్ట్ గా చందూ మొండేటి తన ఆనందాన్ని మరిన్ని ఆసక్తికర అంశాలని విలేఖర్లతో పంచుకున్నాడు. మరి తాను ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారో ఈ ఇంటర్వ్యూలో చూద్దాం.
ఈ సినిమా కథ అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ కోసం మొదలైయిందని విన్నాం ?
పాక్ జైలు లో ఒక సెంట్రి అల్లు అర్జున్ గారి ఫ్యాన్. వాళ్ళు మన తెలుగు సినిమాలు గట్టిగా చూస్తారు. 22 మంది మత్య్సకారులు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.
ఇది బియోపిక్ అనుకోవచ్చా ?
లేదండీ. వాస్తవిక సంఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ. ఇందులో ఇన్సిడెంట్ వాస్తవం. మత్య్సలేశ్యం నుంచి గుజరాత్ వెళ్ళడం అక్కడ నుంచి పాక్ సరిహద్దుల్లో దొరకడం, వారి కోసం పోరాటం.. ఇదంతా వాస్తవం. దానికి ఒక అందమైన ప్రేమకథ అల్లాం. అందుకే రియల్ పేర్లు పెట్టలేదు. మొదట ఈ కథ విన్నప్పుడు పాక్ నేపధ్యంలో చేద్దామని అనుకున్నాను. కానీ అలోచించగా చూస్తే ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్ వుంది. ఈ ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యునికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అందుకే మెదట నుంచి ఈ సినిమా మేము ఎమోషనల్ లవ్ స్టొరీ అనే ప్రమోట్ చేశాం. ఇది ప్యూర్ లవ్ స్టొరీ.
చైతు గారితో తెనాలి రామకృష్ణుడు బయోపిక్ ఎనౌన్స్ చేశారు కదా.. ఏఎన్ఆర్ క్యారెక్టర్ కి చైతు సరిపోతారని ఎప్పుడు అనిపించింది ?
చైతు గారు చాలా సిన్సియర్. ఆయన సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టారు కాబట్టే తండేల్ సక్సెస్ కి మించినన ప్రశంసలు ఆయన నటనకి వస్తున్నాయి. తెనాలి రామకృష్ణుడు క్యారెక్టర్ లో కూడా ఆయన అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వగలరు. అలాంటి సినిమా ఆయన చేయాలని దర్శకుడిగా స్నేహితుడిగా నా కోరిక.
పాక్ ఎపిసోడ్స్ కి సెన్సార్ సమస్యలు వచ్చాయా?
చాలా వచ్చాయి. గ్లింప్స్ లో జెండా చూపించడానికే ఒప్పుకోలేదు. డైలాగ్స్, మ్యుట్స్, విజువల్ కట్స్ చాలా వున్నాయి. ముఫ్ఫై శాతం ఎమోషన్ సెన్సార్ కారణంగా తగ్గింది. అయితే అది వారి డ్యూటీ. మా వరకు మా బెస్ట్ ఇచ్చాం.
అమరన్ తర్వాత సాయి పల్లవి పాత్రలో ఏమైనా మార్పులు చేశారా ?
లేదండీ, అప్పటికే షూటింగ్ అయిపొయింది. అయితే అమరన్ లో సాయి పల్లవిని చూసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చింది.
మీ డైరెక్షన్ లో నాగచైతన్య గారి ఫస్ట్ వందకోట్ల సినిమా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది ?
ఇది గీతా ఆర్ట్స్. అరవింద్ గారు, వాసు గారు, చైతు గారు, దేవిశ్రీ .. ఇలా అంతా కలసి చేసిన కొలాబరేట్ ఎఫర్ట్. నా అక్షర రూపానికి వారంతా విజువల్ ని ఇచ్చారు. చైతు గారికి నేను అంటే చాలా ఇష్టం. మా మధ్య చాలా మంచి స్నేహం వుంది.
నాగార్జున గారు ఈ సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేయడం ఎలా అనిపించింది ?
నాగార్జున గారు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశారు. ఆయన ‘థాంక్ యూ చందు. వి లవ్ యూ’అని చెప్పడం ఆయన గొప్పదనం. అది నాకు గొప్ప ప్రశంస. ఈ సినిమా ఒక గౌరవం తీసుకొస్తుందని ముందు నుంచి నమ్మాం. ప్రేక్షకులు అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్భారు.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ?
ఈ కథని దేవిశ్రీ అర్ధం చేసుకున్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోలేదు. ప్రతి సీన్ మ్యూజిక్ ని ఆయన ముందే ఊహించుకున్నారు. కథలోని ప్రతి ఎమోషన్ పై ఆయనకి పట్టువుంది. పాటలల్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. నేపధ్యం సంగీతంతో ఆద్యంతం కట్టిపడేశారు.
సినిమా పైరసీ బారిన పడినప్పుడు ఎలా ఫీలయ్యారు ?
గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది. ఆ బాధ మాటల్లో చెప్పలేను. సినిమాని ఒక థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీస్తాం. అలాంటిది పైరసీ బారిన పడటం చాలా బాధాకరం. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపొయినంత బాధగా ఉటుంది. చాలా పెయిన్ ఫుల్.
గీతా ఆర్ట్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
పెంటాస్టిక్ ఎక్స్ పీరియన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అరవింద్ గారు లేకుండా ఎలా వుంటుంది? కథలో ప్రశ్నలు వేసే వారు ఎవరని ఫీలయ్యాను. మా మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుంది.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
కార్తికేయ3 వుటుంది. మధ్యలో ఓ సినిమా వుంది. సూర్య గారితో చర్చలు జరుగుతున్నాయి. అది వర్క్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నాను.