ఇంటర్వ్యూ : దర్శకుడు అశ్విన్ శరవణన్ – “కనెక్ట్”లో ఇంటర్వెల్ అందుకే పెట్టలేదు

ఇంటర్వ్యూ : దర్శకుడు అశ్విన్ శరవణన్ – “కనెక్ట్”లో ఇంటర్వెల్ అందుకే పెట్టలేదు

Published on Dec 17, 2022 9:41 PM IST

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో లేటెస్ట్ చిత్రం “కనెక్ట్”. ఓ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ లో రీసెంట్ ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. మరి దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో పేరున్న ఈ దర్శకుడు గతంలో నయనతార నాయికగా “మయూరి”, తాప్సీ హీరోయిన్ గా “గేమ్ ఓవర్” చిత్రాన్ని తెరకెక్కించి ఘన విజయాలు అందుకున్నారు. “కనెక్ట్” రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ యంగ్ దర్శకుడు ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

చెప్పండి ఈ సినిమా కథేంటి ఎలా ఉండబోతుంది?

లాక్ డౌన్ లో కుటుంబాలు కలిసి లేవు. ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లో ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథ. గూస్ బంప్స్ తెప్పించే హార్రర్ థ్రిల్లర్ ఇది.

 

బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు అయన కోసం చెప్పండి

ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు తల్లి ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుంది. ఈ క్యారెక్టర్ లో అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి. ఆ సహజత్వాన్ని అనుపమ్ ఖేర్ తన నటనతో చూపించారు.

 

ఈ చిత్రాన్ని ఇంటర్వెల్ లేకుండా తీయడానికి కారణం ఏంటి?

హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు. ఇటీవల హిట్ అయిన చాలా సినిమాల నిడివి మూడు గంటలు ఉంది, వాటికి ఇంటర్వెల్ గంటన్నరకు ఇచ్చారు. కాబట్టి మా సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది.

 

నయనతార గారితో వర్క్ కోసం చెప్పండి

నయనతారతో గతంలో మాయా (తెలుగులో మయూరి) అనే చిత్రాన్ని రూపొందించాను. ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. దర్శకుడిగా నేనంటే ఆమెకు నమ్మకం. అందుకే మళ్లీ ఈ సినిమాను నయనతారతోనే చేశాను. ఈ కథ విన్నాక ఆమెకు బాగా నచ్చింది. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలన్నది నయనతార కోరిక. అందుకే విఘ్నేష్ తో కలిసి ఆమె ప్రొడ్యూస్ చేసింది. మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ సమకూర్చింది. నటిగా నయనతారను అడ్మైర్ చేస్తాను. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆద్యంతం తన పర్మార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక డిఫరెంట్ కథను చూపిస్తున్నప్పుడు నటీనటుల ఎంత ప్రామిసింగ్ గా కనిపిస్తే అంత సినిమాకు అడ్వాంటేజ్. ఆ విషయంలో నయనతార టాప్ యాక్ట్రెస్.

 

మ్యూజిక్ డైరెక్టర్ కోసం చెప్పండి?

ఈ సినిమాకు పృథ్వీ సంగీతాన్ని అందించారు. సౌండ్ డిజైనింగ్ కోసమే మూడు నెలల సమయం తీసుకున్నాం. అందుకే క్వాలిటీ చాలా బాగా వచ్చింది.

 

తెలుగు నుంచి సినిమాలు తీసే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా?

టాలీవుడ్ నాని సినిమాలంటే ఇష్టం. ఆయనకు గతంలో మయూరి కథ చెప్పాను. తనే సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఆయనతో ఒక సినిమా రూపొందించాలని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు