జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాక్

జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాక్

Published on Sep 16, 2024 4:35 PM IST

ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ గతకొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా కేసు నమోదయ్యింది.

అయితే, ఈ సమయంలో జనసేన పార్టీ జానీ మాస్టర్‌కి షాక్ ఇచ్చింది. జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

గతకొంత కాలంగా జానీ మాస్టర్‌పై పలు విమర్శలు వస్తున్నా, ఆయన జనసేన పార్టీకి స్టార్ కాంపెయినర్‌గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు పోలీసు కేసు నమోదు కావడంతో, జనసేన పార్టీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు