కోలీవుడ్ అడియన్స్ ని మెస్మరైజ్ చేసిన జాన్వీ.!

కోలీవుడ్ అడియన్స్ ని మెస్మరైజ్ చేసిన జాన్వీ.!

Published on Sep 18, 2024 8:05 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుండగా లేటెస్ట్ కోలీవుడ్ లో ప్రమోషన్స్ కి వెళ్లారు. అయితే అయితే తారక్ కి తెలుగు సహా చాలా భాషల్లో పట్టు ఉందని తెలిసిందే.

అలాగే తమిళ్ లో కూడా ఎంతో అనర్గళంగా తాను మాట్లాడగలడు. అయితే నిన్న సర్ప్రైజింగ్ గా తమిళ్ లో ఎంతో అందంగా మాట్లాడుతూ జాన్వీ కపూర్ ఆశ్చర్యపరిచింది అని తమిళ్ ఆడియెన్స్ అంటున్నారు. జాన్వీ తమిళ్ లో ఎంతో చక్కగా మాట్లాడింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనితో కోలీవుడ్ ఆడియెన్స్ లో జాన్వీ కపూర్ కూడా మంచి అటెన్షన్ ని తెచ్చుకుంది అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు