రీ-రిలీజ్ కి రెడీ అయిన “జర్నీ”…బుకింగ్స్ ఓపెన్!

రీ-రిలీజ్ కి రెడీ అయిన “జర్నీ”…బుకింగ్స్ ఓపెన్!

Published on Sep 14, 2024 2:00 AM IST

జై, శర్వానంద్, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జర్నీ. 2011 లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని బాగా అలరించింది. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. సెప్టెంబర్ 21, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

దర్శకుడు ఎం. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని AR మురుగదాస్ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి సి. సత్య సంగీతాన్ని అందించాడు. 4కె వెర్షన్ లో రీ-రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు