సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మే 12న థియేటర్స్లో విడుదలై హిట్ టాక్ని అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లను రాబట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఈ సినిమాలోని “కళావతి” సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న “కళావతి” వీడియో సాంగ్ని యూట్యూబ్లో రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ వారం రోజులోనే ఈ సాంగ్ 4 మిలియన్లకు పైగా వ్యూస్ని రాబట్టుకుని దూసుకుపోతుంది. సిద్ శ్రీరాం పాడిన ఈ పాటకు, అనంత శ్రీరాం లిరిక్స్ అందించగా, థమన్ సంగీతాన్ని అందించారు.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి