డైరెక్ట్‌గా ఓటీటీలోకి “కిన్నెరసాని”.. ఎప్పుడంటే?

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కిన్నెరసాని’. నాగశౌర్య ‘అశ్వథ్థామ‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్.ఆర్.టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రజ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌ నిర్మాతలు. అయితే ఐదు నెలల క్రితమే ‘కిన్నెరసాని’ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాను ముందుగా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ చివరకు ఆ డిసీషన్ మార్చుకున్నారు మేకర్స్.

ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని, “జీ5′ వేదికగా జూన్ 10న ‘కిన్నెరసాని’ విడుదల కానుందని ‘జీ5’ సంస్థ తాజాగా వెల్లడించింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ థ్రిల్లర్ సినిమాలో షీతల్, కషిష్ ఖాన్ హీరోయిన్లుగా నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

Exit mobile version