అలియాభట్‌ మూవీ పై ఆమె ఆగ్రహం

అలియా భట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం ‘జిగ్రా’. దసరా కానుకగా ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఐతే, తాజాగా ఈ చిత్రబృందంపై టీ సిరీస్‌ నిర్మాత భూషణ్‌కుమార్‌ సతీమణి, నటి దివ్య ఖోస్లా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఓ వైపు జిగ్రా సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నప్పటికీ, ఫేక్‌ కలెక్షన్స్‌ ఎలా ప్రకటిస్తున్నారు ? అంటూ ఆమె సీరియస్ అయ్యారు. అసలు నటి దివ్య ఖోస్లా ఏం మాట్లాడారు అంటే.. ‘జిగ్రా’ వీక్షించేందుకు థియేటర్‌కు వెళ్లా. హాలు మొత్తం ఖాళీగా ఉంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది’ అని ఆమె అన్నారు.

నటి దివ్య ఖోస్లా ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా బృందమే టికెట్లు కొనుగోలు చేసి.. ఫేక్‌ కలెక్షన్స్‌ అనౌన్స్‌ చేస్తున్నందుకు అలియాభట్‌ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పెయిడ్‌ మీడియా సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే షాక్ గా అనిపిస్తోంది. ఆడియన్స్ ను వెర్రివాళ్లను చేయకూడదు కదా’ అని నటి దివ్య ఖోస్లా చెప్పుకొచ్చారు. దీంతో, ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా కరణ్‌ జోహార్‌ ఈ పోస్ట్‌ పై స్పందిస్తూ.. ‘మూర్ఖులకు మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం మౌనమే’ అని కామెంట్ పెట్టారు.

Exit mobile version