తెలుగులో “సత్యం సుందరం” గా రిలీజ్ కానున్న కార్తీ నెక్స్ట్ మూవీ!

తెలుగులో “సత్యం సుందరం” గా రిలీజ్ కానున్న కార్తీ నెక్స్ట్ మూవీ!

Published on Sep 8, 2024 10:20 AM IST


కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెయియజగన్ చిత్రం తెలుగులో సత్యం సుందరంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే విషయాన్ని మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. కార్తీ మరియు అరవింద్ స్వామి కలిసి ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను అలరిస్తుంది.

సెప్టెంబర్ 27, 2024 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం దేవర చిత్రం తో క్లాష్ కానుంది. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక మరియు సూర్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. రాజ్ కిరణ్, శ్రీదివ్య, స్వాతి కొండే, దేవదర్షిణి, జయప్రకాష్, శ్రీరంజని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు