ఓటీటీలోకి రవితేజ “ఖిలాడీ”.. డేట్ ఫిక్స్..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఖిలాడీ”. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, యాంకర్ అనసూయ కీలక పాత్రలు పోశించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మరీ ఓటీటీలోనైనా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Exit mobile version