బన్నీతో కియారా అద్వానీ.. నిజమేనా ?

బన్నీతో కియారా అద్వానీ.. నిజమేనా ?

Published on Jun 17, 2024 8:57 AM IST

స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ ను కియారా అద్వానీ చేత చేయిస్తే బాగుంటుందని తాజాగా మేకర్స్ ఫీల్ అవుతున్నారు. మరి కియారా అద్వానీ ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

మొత్తానికి ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024 లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక ప్రస్తుతం పుష్ప టైటిల్ సాంగ్ తో పాటు ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు