అలా ఫోటోలు తీయడం దారుణం – స్టార్ హీరో కుమార్తె

అలా ఫోటోలు తీయడం దారుణం – స్టార్ హీరో కుమార్తె

Published on Oct 21, 2024 9:06 PM IST

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలియసిందే. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరోజా సంజీవ్ తుదిశ్వాస విడిచారు. అయితే, తన తల్లి మరణంపై కిచ్చా సుదీప్‌ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో సుదీప్ కుమార్తె శాన్వీ కూడా తన ఇన్‌స్టా వేదికగా పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తన నాయనమ్మ అంత్యక్రియల్లో మీడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ ఆవేదనతో అసహనం వ్యక్తం చేశారు. కొందరు మీడియా వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారని ఆమె తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇంతకీ, శాన్వీ తన పోస్ట్ ఏం రాశారంటే.. ‘నాయనమ్మను కోల్పోయిన దుఃఖంలో ఉంటే.. కొందరు వ్యక్తులు నా మొహంపై కెమెరాలు పెట్టి ఫోటోలు తీశారు. బాధతో ఉన్న వ్యక్తిపై ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా ?, వారి కారణంగా నేను నాయనమ్మకు సరైన సెండాఫ్ ఇవ్వలేదు. నాన్నతో కూడా వారు అలానే ప్రవర్తించారు. ఆయన ఏడుస్తుంటే.. జనాలు ఆయన్ని నెట్టేశారు. వారికి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ భావోద్వేగాలను అర్థంచేసుకోవడంలో లేకపోవడం దారుణం’ అంటూ శాన్వీ తన పోస్ట్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు