సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన ‘కోర’

సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన ‘కోర’

Published on Apr 6, 2025 10:30 AM IST


సునామీ కిట్టి హీరోగా ఒరాటశ్రీ డిఫెరెంట్ కాన్సెప్ట్, హై ఓల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన సినిమానే ‘కోర’. ఈ సినిమాలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌, పాటలు సినిమా మీద అంచనాలు పెంచాయి.

ఇక లేటెస్ట్ గా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రిలీజ్ చేసిన ఒప్పుకుందిరో అంటూ సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఈ ఏప్రిల్ నెలలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ మేరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ప్రస్తుతం అయితే సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందించారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు