‘కన్నప్ప’లో మరో హీరో ?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. ఐతే, ఈ సినిమాలో ఇప్పుడు మరో సౌత్ హీరో కూడా కనిపించబోతునట్లు తెలుస్తోంది. తమిళ హీరో శింబు కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నాడని టాక్. కొన్ని సీన్స్ లో మాత్రమే శింబు పాత్ర ఉంటుందట. మరి ఈ వార్తలో ఎలాంటి వాస్తవం ఉందో చూడాలి.

కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ బాగానే ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలను పెంచింది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version