శంకర్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్

శంకర్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్

Published on Jun 30, 2024 11:30 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్‌ సినిమాకి సంబంధించి ఇంకా పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని శంకర్‌ క్లారిటీ ఇచ్చారు. పైగా ఇండియన్ 2 రిలీజ్‌, ప్రమోషన్స్ అయ్యాకే గేమ్ చేంజర్ షూటింగ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇండియన్ 2 సినిమా కోసం గేమ్ చేంజర్‌ను పక్కన పెట్టడం మెగా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.

దీనికితోడు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చెక్ చేసి, ఆ తర్వాతే రిలీజ్ డేట్ మీద నిర్ణయం తీసుకుంటామని శంకర్ చెప్పుకొచ్చాడు. దీంతో శంకర్ పై మెగా ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. కాగా ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు