మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్

మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్

Published on Sep 11, 2024 7:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “గుంటూరు కారం” తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్ట్ దర్శకుడు రాజమౌళితో చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కనుండగా భారీ హైప్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం కోసం మహేష్ తన లుక్ ని మొత్తం మార్చేస్తుండగా అసలు ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలు అవుతుంది అనేది పెద్ద సస్పెన్స్ గా ప్రస్తుతం మారిపోయింది.

మరి ఈ ఏడాదిలోనే మొదలు అవుతుంది అని ఇన్ని రోజులు టాక్ ఉంది కానీ లేటెస్ట్ గా ఓ స్ట్రాంగ్ బజ్ సినిమా షూటింగ్ సంబంధించి ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఏకంగా వచ్చే ఏడాది జనవరి నుంచే మొదలు కానుంది అని తెలుస్తుంది. దీనితో ఈ సినిమాకి ఇంకా చాలా సమయం ఉందనే చెప్పాలి. ఈ గ్యాప్ లో సినిమాకి కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ అలాగే వర్క్ షాప్, నటీనటుల ఎంపికలు వంటివి అన్నీ పూర్తి చేస్తారట. సో ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది నుంచి మొదలు కానుంది అని ఇప్పుడు చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు